ఈ నవల గురించి ఈ మాటలు చాలు...అద్భుతమైన నవల
ఉరితీసే ముందు నా చివరికోరిక ఒకేఒకటి..నేను ఉరికొయ్యకు వేలాడుతోన్న దృశ్యాన్ని నా మిత్రుడు చూడాలి.చెప్పాడు సత్యవర్ధన్
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."కొద్దీ క్షణాల్లో నల్లటిగుడ్డ అతని మొహం మీద కప్పబడింది.చెక్కతలుపు మీద అతను...లివర్ కదిలింది.ఉరికొయ్యకు అతని దేహం వేలాడింది...
ఈ వ్యవస్థలోని లోపాలకు అతని మరణమే ...మరణశాసనం కావాలి...ఆ క్షణమే వర్షం మొదలైంది...
మరణానికి ముందు మిత్రుడు రాసిన ఉత్తరం అతడిని యుద్ధభూమి వైపు నడిపించింది...
*నువ్వు నన్ను ప్రేమించినా...ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను..ఇది ఫిక్స్...చెప్పాడు సాకేత్ ఆముక్తమాల్యదతో.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అంది.
* బాబాలు స్వామీజీలు ప్రజల బలహీనతలతో ఆడుకునే వ్యవస్థలో నుంచి పుట్టుకువచ్చిన పుట్టగొడుగు కృష్ణస్వామి కి పరమభక్తురాలు అముక్త...అక్కడ ఆ ఆశ్రమంలో జరిగే తంతు చూసేక ఎలా రియాక్టయింది?
రంగస్థలమ్మీద నటించే అతను జీవిత రంగస్థలంమీద యుద్ధం మొదలుపెట్టాడు..మారణశాసనాన్ని పునర్లిఖిస్తున్నాడు.
