నవల చదువుతున్నంత సేపు మనసును కట్టిపడేసిన నవల
నిద్ర పట్టడంలేదు ప్రవల్లికకు...ఈ రెండు మూడు రోజులుగా అనీజీగా వుంది.
ఎత్తులు, వాటికి పైఎత్తులు...రక్త పాతాలు ...ఎందుకో మనసంతా అనీజీగా వుంది.
ఎందుకీ రక్తపాతం? తన తండ్రి ఎం సాధించాలనుకుంటున్నాడు? ఓ మనిషికి సుఖంగా బ్రతకడానికి ఎం కావాలో, అవన్నీ తండ్రికి పుష్కలంగా వున్నాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వుంది.
కానీ ఇంకా ఈ కాంక్ష దేనికి?
ఎవర్ని ఉద్దరించాలని ఈ మారణహోమం?...మొదటిసారిగా ఎందుకో ఆమెలో వైరాగ్యం మెల్ల మెల్లగా చోటు చేసుకుంటున్నట్లనిపించింది.
డోర్ తీసి బయట కొచ్చింది....వరండాలో లైటు వెలుగుతోంది. కిందికి వచ్చి ఫ్రిజ్ లోని బాటిల్ తీసి నీళ్లు తాగింది. తండ్రి గాడి వేపు చూసింది. ఇంకా లైటు వెలుగుతోంది.
మెల్లగా అటువైపు అడుగులు వేసింది. లోపలనుండి మాటలు వినిపిస్తున్నాయి.
ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్ధమవుతున్నది.
ఇలాంటి అద్భుతమైన వాక్యాలు.జీవితసత్యాలు ,ఉత్కంఠ రేపే కథనం
